Maganti Babu: పార్టీ మారేటప్పుడు బురద జల్లడం సరికాదు.. మీ గౌరవం నిలబెట్టుకోండి: మాగంటి బాబు సలహా

  • అవాస్తవాలు చెబితే నమ్మే పరిస్థితి లేదు
  • పార్టీ మారగానే ఆరోపణలు చేయడం తగదు
  • వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం

కండువా మార్చుకుని అవాస్తవాలు చెబితే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని టీడీపీ ఎంపీ మాగంటి బాబు అన్నారు. నేడు ఆయన ఏలూరులో మీడియాతో మాట్లాడుతూ.. నాలుగేళ్లు టీడీపీ కండువా కప్పుకుని పార్టీ మారగానే ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. టీడీపీకి సిద్ధాంతాలున్నాయని.. వచ్చే ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని బాబు తెలిపారు. పార్టీ మారేటప్పుడు బురద జల్లడం సరికాదని, మీ గౌరవం నిలబెట్టుకుంటే మంచిదని అవంతి శ్రీనివాస్, ఆమంచి కృష్ణమో‌హన్‌లకు ఆయన సూచించారు.

More Telugu News