paruchuri: మహిళలను మళ్లీ థియేటర్స్ కి రప్పించిన సినిమా 'ఎఫ్ 2': పరుచూరి గోపాలకృష్ణ

  • ఈ ఏడాది ఆరంభంలో తొలి హిట్ 
  • ఆడియన్స్ అలా ఆలోచించారు 
  • గతంలోను ఈ కాన్సెప్ట్ సినిమాలు హిట్ అయ్యాయి

ఈ ఏడాది ఆరంభంలో సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎఫ్ 2' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ ఈ సినిమాను గురించే మాట్లాడారు. "ఫస్టాఫ్ లో హీరోయిన్ల సతాయింపు తట్టుకోలేక హీరోలు ఫారిన్ పారిపోతారు. సెకండాఫ్ లో హీరోయిన్లకి ఎలా జ్ఞానోదయం అవుతుందా అని అంతా ఆలోచిస్తారు.

కానీ హీరోయిన్లకి జ్ఞానోదయం అయ్యేలా దర్శకుడు అనిల్ రావిపూడి మేజిక్ చేశాడు. ఇది చీటింగ్ స్క్రీన్ ప్లే అయినా నవ్వులతో నడిపించేశాడు. మహిళలు సినిమాలకి ఎక్కువగా రావడం లేదని అనుకుంటూ ఉండగా, మళ్లీ వాళ్లందరినీ థియేటర్స్ కి రప్పించిన ఘనత అనిల్ రావిపూడి సొంతం. భార్యా భర్తలన్నాక ఎప్పుడో ఓసారి ఏదో ఒక గొడవ అవుతూనే ఉంటుంది. ఆ ఇద్దరి ఈగోలపై గతంలో అక్కినేని .. శోభన్ బాబు వంటి వారితో చేసిన సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి" అని చెప్పుకొచ్చారు.

More Telugu News