anna canteens: ఎపీలోని ఆరు పట్టణాల్లో మరో 13 అన్న క్యాంటీన్లు!

  • రూ.5.36 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణం
  • ఇప్పటికే రాష్ట్రంలో 203 క్యాంటీన్లు
  • కొత్తవాటితో మొత్తం సంఖ్య 216

ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అన్నక్యాంటీన్లకు అన్నివర్గాల నుంచి అనూహ్యమైన ఆదరణ లభిస్తుండడంతో మరికొన్ని పట్టణాల్లో వీటిని ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. పేదలు, సామాన్య వర్గాలు అధికంగా నివసించే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి రూ.5కే ఉదయం టిఫిన్‌, మధ్యాహ్నం, రాత్రి భోజనం పెడుతున్న విషయం తెలిసిందే.

తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే వీటిని ఏర్పాటు చేయగా, స్పందన బాగుండడంతో క్రమేపీ విస్తరిస్తూ వచ్చారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వివిధ పట్టణ ప్రాంతాల్లో మొత్తం 203 అన్నక్యాంటీన్లు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 6 పట్టణాల్లో 13 కొత్త క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకోసం 5.36 కోట్ల నిధులను కేటాయించింది. కొత్తక్యాంటీన్లు అందుబాటులోకి వస్తే మొత్తం సంఖ్య 216కు చేరుతుంది.

More Telugu News