Jammu And Kashmir: శ్రీనగర్ లో ఉగ్రవాదుల దాడిని ఖండించిన ఏపీ సీఎం చంద్రబాబు

  • సీఆర్పీఎఫ్ జవాన్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా
  • అమరవీరుల కుటుంబాలకు నా సంతాపం 
  • గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలి 

జమ్ముకశ్మీర్ లో సీఆర్ఫీఎఫ్ వాహనంపై జరిగిన ఉగ్రవాదుల దాడిని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఖండించారు. సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని, అమరవీరుల కుటుంబాలకు తన సంతాపం తెలియజేస్తున్నానని అన్నారు. ఈ ఘటనలో గాయపడ్డ జవాన్లు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ఓ ట్వీట్ లో చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా, ఏపీ మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ఘటనపై స్పందించారు. పుల్వామాలో జరిగిన ఘటనలో ముప్పై మంది జవాన్లు అమరులైన ఘటన హృదయాన్ని కలచివేస్తోందని అన్నారు. అమరవీరుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నానని, ఇలాంటి హింసాత్మక ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.





More Telugu News