Koya Praveen: ఆంధ్రప్రదేశ్ లో ఆరుగురు ఐపీఎస్‌ అధికారుల బదిలీ

  • ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
  • బదిలీ అయిన వారిలో ప్రకాశం, కడప ఎస్పీలు
  • విజయవాడ సిటీ జాయింట్ కమిషనర్‌ బదిలీ

ఆంధ్రప్రదేశ్‌లో ఆరుగురు ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు నేడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం ఎస్పీ కోయ ప్రవీణ్, ఐజీ వినీత్ బ్రిజ్ లాల్,  విజయవాడ సిటీ జాయింట్ కమిషనర్‌ నవదీప్ సింగ్, కడప ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ, విశాఖ గ్రేహౌండ్స్ గ్రూప్ కమాండర్‌ సత్య ఏసుబాబు, గ్రేహౌండ్స్‌ గ్రూప్ కమాండర్‌ అభిషేక్ మహంతిలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

More Telugu News