Andhra Pradesh: మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలతోనే కోటబొమ్మాళిలో మాపై దాడి జరిగింది!: వైసీపీ నేత పేరాడ తిలక్

  • పక్కా ప్లాన్ తోనే దాడి చేశారు
  • చాలామంది ఇటీవల వైసీపీలో చేరారు
  • అది తట్టుకోలేక మంత్రి దాడి చేయించారు

టీడీపీ నేత బోయిన రమేశ్ తన అనుచరులతో కలిసి వైసీపీ ఆఫీసుపై కర్రలు, రాడ్లతో దాడి చేశారని టెక్కలి నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ తెలిపారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి చోటుచేసుకుందని ఆరోపించారు. ఇటీవల వైసీపీలోకి పలువురు టీడీపీ నేతలు చేరారని తిలక్ అన్నారు.

ఈ నేపథ్యంలో నిన్న కోటబొమ్మాళికి వచ్చిన ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తన గూండాల ద్వారా దాడి చేయించారని ఆరోపించారు. అచ్చెన్నాయుడుపై మర్డర్ కేసు ఉందనీ, అధికారంలోకి వచ్చాక మాఫీ చేయించుకున్నారని దుయ్యబట్టారు. అచ్చెన్నాయుడు ఆదేశాలతోనే ఈ దాడి జరిగిందని స్పష్టం చేశారు.

More Telugu News