Andhra Pradesh: శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ-టీడీపీ శ్రేణుల మధ్య తీవ్ర ఘర్షణ.. రక్తసిక్తమైన వైసీపీ ఆఫీసు!

  • కోటబొమ్మాళిలో ఘటన
  • టీడీపీ-వైసీపీ శ్రేణుల మధ్య గొడవ
  • వైసీపీ ఆఫీసులో ఫర్నీచర్, ఫైళ్లు ధ్వంసం

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. ఈ సందర్భంగా టీడీపీ, వైసీపీ నేతలు పరస్పరం కర్రలు, రాడ్లు, రాళ్లతో దాడి చేసుకున్నారు. జిల్లాలోని కోటబొమ్మాళి మండల కేంద్రంలో ఈరోజు ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో నలుగురు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడగా, బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈరోజు ఉదయం టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో రెచ్చిపోయిన టీడీపీ శ్రేణులు వైసీపీ ఆఫీసుకు వెళ్లి దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో నలుగురు వైసీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఆఫీసులోని ఫర్నీచర్ తో పాటు ఫైళ్లను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.  అయితే ఈ ఘటనపై పోలీసులు ఇంతవరకూ ఎలాంటి కేసు నమోదు చేయలేదు.

More Telugu News