Chigurupati Jayaram: రోజుకో మలుపు తిరుగుతున్న చిగురుపాటి హత్యోదంతం.. ‘ఆ నలుగురు’ నటుడు సూర్యపై అనుమానం

  • చిరుగుపాటి హత్యకేసులో నటుడు సూర్య ప్రసాద్‌పై అనుమానం
  • హత్య జరిగిన రోజు రాకేశ్ ఇంటికి సూర్య
  • విచారించిన బంజారాహిల్స్ పోలీసులు

ప్రముఖ పారిశ్రామికవేత్త చిగురుపాటి హత్యోదంతంలో తవ్వుతున్న కొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ కేసులో తొలుత ఆయన మేనకోడలు శిఖా చౌదరిని అనుమానించారు. ఆ తర్వాత ఆమె స్నేహితుడు రాకేశ్ రెడ్డి ఈ హత్యకు పాల్పడినట్టు నిర్ధారించారు. తాజాగా, ఈ హత్య కేసులో ‘ఆ నలుగురు’ నటుడు సూర్య ప్రసాద్ ప్రమేయం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.  

రాకేశ్ రెడ్డికి సూర్య స్నేహితుడు కావడం, హత్యకు ముందు సూర్యతో ప్రసాద్ ఫోన్లో మాట్లాడినట్టు తేలడంతో పోలీసులు ఈ కోణంలో విచారిస్తున్నారు. మరోవైపు, గత నెల 30న అంటే హత్య జరిగిన రోజున రాకేశ్ ఇంటికి సూర్య వచ్చి వెళ్లినట్టు తెలుస్తోంది. దీంతో సూర్యను పిలిపించిన బంజారాహిల్స్ పోలీసులు బుధవారం అతడిని విచారించారు. ఈ హత్యకేసుతో సంబంధం ఉన్న మరికొందరిని నేడు విచారించనున్నట్టు పోలీసులు తెలిపారు.

More Telugu News