mamata banerjee: మేం ఎవరికీ భయపడం..పోరాడతాం: సీఎం మమతా బెనర్జీ

  • కేజ్రీవాల్ కు మేము మద్దతుగా ఉన్నాం
  • మోదీని ఇంటికి పంపేందుకు కంకణం కట్టుకున్నాం
  • రాష్ట్రాల హక్కులను మోదీ హరిస్తున్నారు

తాము ఎవరికీ భయపడమని, పోరాడతామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ మరోసారి స్పష్టం చేశారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాకు ఆమె మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా జంతర్ మంతర్ వద్ద  నిర్వహించిన సభలో మమతా బెనర్జీ మాట్లాడుతూ, కేజ్రీవాల్ కు తాము మద్దతుగా ఉన్నామని, మోదీని ఇంటికి పంపేందుకు కంకణం కట్టుకున్నామని అన్నారు. రాష్ట్రాల హక్కులను హరిస్తున్న మోదీ, దేశంలో ఏ అభివృద్ధి జరిగినా తానే చేశానని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశంలో డెమోక్రసీ ‘నమోక్రసీ’ అయిందని దుమ్మెత్తిపోశారు. మోదీకి లోక్ సభలో ఇదే చివరిరోజని, ప్రజల  మధ్య చిచ్చు పెడుతున్న ఆయనకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.

More Telugu News