Shruti: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • రెండేళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు 
  • మాటలు రాసిన హాస్యనటుడు 
  • పోలీస్ పాత్రలో అందాలతార పాయల్ 

*  అందాలతార శ్రుతిహాసన్ తెరమీద కనిపించి రెండేళ్లయింది. అవకాశాలు లేకకాదు.. తనకు ఎంతో ఇష్టమైన సంగీతంలో బిజీగా ఉండి, తనకు తానుగానే సినిమాలకు దూరంగా వుంది. ఇప్పుడు తమిళ దర్శకుడు జననాథన్ దర్శకత్వంలో హీరో విజయ్ సేతుపతి నటించే చిత్రంలో కథానాయికగా నటించడానికి ఈ చిన్నది ముందుకొచ్చింది. మరి తెలుగులో కూడా కొత్త సినిమాలు ఒప్పుకుంటుందేమో!
*  'అర్జున్ రెడ్డి' చిత్రంతో కమేడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ రామకృష్ణ తాజగా ఓ చిత్రానికి మాటలు కూడా రాశాడు. నూతన దర్శకుడు ప్రశాంత్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన 'మిఠాయి' చిత్రానికి రాహుల్ రామకృష్ణ మాటలు రాశాడట.
*  'ఆర్ ఎక్స్100' ఫేం పాయల్ రాజ్ పుత్ మెల్లిగా బిజీ అవుతోంది. ఇప్పటికే రవితేజ నటించే 'డిస్కో రాజా' చిత్రంలో కథానాయికగా ఎంపికైన ఈ ముద్దుగుమ్మ తాజాగా నూతన దర్శకుడు ప్రణదీప్ రూపొందించే లేడీ ఓరియెంటెడ్ చిత్రంలో నటించడానికి ఓకే చెప్పింది. ఇందులో పాయల్ మహిళా పోలీస్ పాత్ర పోషిస్తుందట.  

More Telugu News