Sumithra Mahajan: 16వ లోక్‌సభ ముగింపు సందర్భంగా స్పీకర్ విందు ఏర్పాటు

  • రేపటితో ముగియనున్న 16వ లోక్‌సభ
  • విందుకు వివిధ పార్టీల నేతలు హాజరు
  • విందులో ప్రత్యేకం రుచికరమైన లడ్డూ-బాప్లా

16వ లోక్‌సభ రేపటితో ముగియనుంది. ఈ సందర్భంగా నేడు స్పీకర్ సుమిత్ర మహాజన్ విందు ఏర్పాటు చేశారు. ఉభయ సభలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ పార్టీల నేతలు ఈ విందుకు హాజరయ్యారు. ఈ విందులో అత్యంత రుచికరమైన లడ్డూ-బాప్లాను వడ్డించారు. ఈ వంటకం సుమిత్ర మహాజన్ స్వరాష్ట్రమైన మధ్యప్రదేశ్‌ ప్రాంతానికి చెందినది కావడం విశేషం. ఈ విందుకు ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు, లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై, హోంమంత్రి రాజనాథ్ సింగ్, విపక్ష కాంగ్రెస్ నేత మల్లికార్జునఖర్గే తదితరులు హాజరయ్యారు.

More Telugu News