talasani: రెండు రోజుల పాటు ఏపీలో పర్యటించనున్న తలసాని శ్రీనివాస్ యాదవ్

  • రేపటి నుంచి రెండు రోజుల పాటు తలసాని పర్యటన
  • రెండు వివాహ కార్యక్రమాల్లో పాల్గొననున్న నేత
  • గత నెలలో కూడా ఏపీలో పర్యటించిన తలసాని

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాద్ మరోసారి ఏపీలో పర్యటించనున్నారు. రేపటి నుంచి రెండు రోజల పాటు ఏపీలో ఆయన పర్యటిస్తారు. గుంటూరు, ద్రాక్షారామంలలో జరిగే వివాహ వేడుకల్లో ఆయన పాల్గొననున్నారు. గత నెలలో కూడా ఆయన ఏపీలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటన సందర్భంగా ఏపీలో బీసీలకు నాయకత్వం వహిస్తానని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఆయన మరోసారి పర్యటించనుండటంపై ఆసక్తి నెలకొంది. 

More Telugu News