Tollywood: ఈ లెజెండ్ గురించి ఎవరు ఎంత చెప్పినా తక్కువే.. మమ్ముట్టిపై అనసూయ ప్రశంసల వర్షం!

  • సుచరితారెడ్డి పాత్ర నా మనసులో ఎన్నటికీ ఉండిపోతుంది
  • నన్ను నమ్మినందుకు దర్శకుడు రాఘవ్ కు కృతజ్ఞతలు
  • ట్విట్టర్ లో స్పందించిన అనసూయ భరద్వాజ్

వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా ‘యాత్ర’ సినిమాను దర్శకుడు మహి.వి.రాఘవ్ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో గౌరు సుచరితారెడ్డి పాత్రలో అనసూయ నటించింది. యాత్ర సినిమాలో తన పాత్రను అభినందిస్తూ సందేశాలు పంపుతున్న అభిమానులకు అనసూయ కృతజ్ఞతలు తెలిపింది.

ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘యాత్రలో నేను పోషించిన సుచరితారెడ్డి పాత్ర నా మనసులో ఎప్పటికీ ఉండిపోతుంది. ఈ పాత్ర నేను చేయగలనని నమ్మి ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు మహి.వి.రాఘవ్ సార్ కు, 70mmEntertainsకు కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేసింది.
అనంతరం ఈ సినిమాలో వైఎస్ పాత్ర పోషించిన మాలీవుడ్ సూపర్ స్టార్ మమ్ముట్టి గురించి మాట్లాడుతూ..‘ఈ లెజెండ్ గురించి ఎవరు ఎంత మాట్లాడినా తక్కువే. మమ్ముట్టి సార్.. వైఎస్ గారి పాత్ర పోషించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమాతో మమ్ముట్టి సార్ వైఎస్ గారు బతికున్నప్పటి రోజులను గుర్తుచేశారు. ఇకపై యాత్ర చూసిన ప్రతీసారి అప్పటి రోజులు గుర్తుకు వస్తాయి’ అని వ్యాఖ్యానించింది. గత శుక్రవారం విడుదలైన యాత్ర సినిమా థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది.

More Telugu News