Jagan: ‘యాత్ర’ విషయమై జగన్, ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు: దర్శకుడు మహి

  • సక్సెస్ టాక్‌తో నడుస్తున్న ‘యాత్ర’
  • జగన్‌తో దర్శక, నిర్మాతల భేటీ
  • సినిమా చూడాలని కోరానన్న మహి

సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మహీ వి రాఘవ తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ నెల 8న విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ టాక్‌తో నడుస్తోంది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కథతో తెరకెక్కిన ఈ చిత్రం.. వైఎస్ అభిమానుల నుంచే కాకుండా సినీ ప్రియుల మన్ననలూ అందుకుంటోంది.

ఈ సందర్భంగా ‘యాత్ర’ చిత్ర దర్శకుడు, నిర్మాతలు వైసీపీ అధినేత జగన్‌తో భేటీ అయ్యారు. అనంతరం మహి మీడియాతో మాట్లాడుతూ.. జగన్‌ను కుటుంబ సమేతంగా సినిమా చూడాలని కోరినట్టు తెలిపారు. రాజశేఖర్‌రెడ్డి జీవితకథను తెరకెక్కించే అదృష్టం తనకు దక్కిందన్నారు. ఈ సినిమా విషయంలో జగన్, ఆయన కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేసినట్టు మహి తెలిపారు.

More Telugu News