Andhra Pradesh: నెల్లూరులో చంద్రబాబు టూర్.. పార్కులో హుషారుగా ముఖ్యమంత్రి ఎక్సర్ సైజ్.. వీడియో వైరల్!

  • 4 లక్షల ఇళ్లు లబ్ధిదారులకు అందజేత
  • కార్యక్రమాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి
  • సీఎం వెంట మంత్రి నారాయణ, మేయర్ అజీజ్

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్లు లేని నిరుపేదలకు చంద్రబాబు ప్రభుత్వం ఈరోజు 4 లక్షల గృహాలను అందించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ గృహకల్ప పథకం కింద నిర్మించిన ఈ ఇళ్లను ముఖ్యమంత్రి చంద్రబాబు లబ్ధిదారులకు ఈరోజు అందించారు. నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర కాలనీని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు లబ్ధిదారులతో ముచ్చటించారు.

గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మించిన ఈ ఇళ్లను పరిశీలించిన అనంతరం అక్కడే పార్కులో ఏర్పాటు చేసిన పలు వ్యాయామ పరికరాలతో ఎక్సర్ సైజ్ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట జిల్లా మంత్రి నారాయణ, మేయర్ అజీజ్ తదితరులు ఉన్నారు. చంద్రబాబు హుషారుగా ఎక్సర్ సైజ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

More Telugu News