Andhra Pradesh: లోకేశ్ సభలో ‘జగన్’ ఫొటోలున్న కుర్చీలు.. నిర్వాహకులపై మండిపడ్డ టీడీపీ నేతలు!

  • తిరుపతిలో ఈరోజు ఇళ్ల అందజేత కార్యక్రమం
  • హాజరైన మంత్రులు లోకేశ్, ఆదినారాయణ రెడ్డి
  • కుర్చీలపై ‘రావాలి జగన్-కావాలి జగన్’ స్టిక్కర్లు

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్, మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈరోజు తిరుపతిలో పర్యటించారు. ఎన్టీఆర్ గృహకల్ప పథకంలో భాగంగా లబ్ధిదారులకు ఇళ్లను అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుల నిర్లక్ష్యంతో సభలో వైసీపీ అధినేత జగన్ స్టిక్కర్లు ప్రత్యక్షమయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజల కోసం తెచ్చిన కుర్చీలపై ‘రావాలి జగన్-కావాలి జగన్’ అని స్టిక్కర్లు దర్శనమిచ్చాయి.

టీడీపీ కార్యక్రమంలో జగన్ ఫొటోలున్న కుర్చీలు కనిపించడంతో మీడియా ప్రతినిధులు అక్కడకు చేరుకుని చిత్రీకరించడం ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన టీడీపీ నేతలు ఆ కుర్చీలను సభా ప్రాంగణం నుంచి తొలగించారు. ఈ సందర్భంగా సభకు ఏర్పాట్లు చేసిన నిర్వాహకులపై టీడీపీ నేతలు మండిపడ్డారు. రెండ్రోజుల క్రితం తిరుపతిలో జగన్ ‘సమర శంఖారావం’ సభ జరిగిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమానికి అందించిన కుర్చీలనే తాజాగా ఇప్పుడు టీడీపీ సభకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

More Telugu News