China: 74 ఏళ్ల కుమార్తెకు ‘లక్కీ మనీ’ ఇచ్చిన 105 సంవత్సరాల తల్లి.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో!

  • చైనాలోని జియాంగ్సూ ప్రావిన్సులో ఘటన
  • లక్కీ మనీని అందించిన తల్లి
  • సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం

అమ్మకు తన పిల్లలపై ఎంతటి ప్రేమ ఉంటుందో అందరికీ తెలుసు. తాజాగా దీన్ని నిరూపించే ఘటన చైనాలోని జియాంగ్సూ ప్రావిన్సులో చోటుచేసుకుంది. లియాంగ్యుంగ్ గాంగ్ ప్రాంతానికి చెందిన ఓ 105 ఏళ్ల పెద్దావిడ తన 74 ఏళ్ల కుమార్తె సంతోషంగా ఉండాలంటూ ఎరుపురంగు సంచిలో నగదును అందించింది. దీన్ని అక్కడ లక్కీ మనీగా పిలుస్తారు. తన తల్లి నగదును ఇవ్వడంతో ఆమె కుమార్తె కళ్లు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తల్లి ప్రేమంటే ఇదేనని ప్రశంసిస్తున్నారు.


More Telugu News