Redmi Note 7: ఆకట్టుకునే ఫీచర్లతో రెడ్ మీ నోట్ 7 స్మార్ట్ ఫోన్

  • త్వరలో భారత మార్కెట్లోకి
  • 3 జీబీ/4 జీబీ వేరియంట్లలో విడుదలయ్యే అవకాశం
  • మూడు రంగులలో లభ్యం

గత నెల చైనాలో విడుదలైన రెడ్ మీ నోట్ 7 స్మార్ట్ ఫోన్ త్వరలో భారత మార్కెట్లో విడుదల కానుంది. 48 మెగా పిక్సెల్ కెమెరా, అధునాతన స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ తో పాటు ఈ ఫోన్లో పలు రకాల అద్భుత ఫీచర్లు ఉన్నాయి. 3 జీబీ/32 జీబీ స్టోరేజ్ ఆప్షన్ గల ఫోన్ ధర మన దేశంలో రూ.10,500గా ఉండనుంది. అలాగే, 4 జీబీ/64 జీబీ స్టోరేజ్ ఆప్షన్ గల ఫోన్ ధర రూ.12,400గా ఉండే అవకాశం ఉంది. కాగా, భారీ బ్యాటరీ బ్యాక్ అప్ (4,000ఎంఏహెచ్) గల ఈ ఫోన్ రెడ్, బ్లాక్, బ్లూ రంగులలో అందుబాటులో ఉండనుంది.

More Telugu News