yatra: ‘యాత్ర’ సినిమా అందరి గుండెలను తాకింది.. మమ్ముట్టిలో వైఎస్సే కనిపించారు!: కొడాలి నాని

  • పాదయాత్ర ఆధారంగానే సంక్షేమ పథకాలు
  • సినిమా దర్శకుడు, యూనిట్ కు అభినందనలు
  • ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత

ఏపీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన ‘యాత్ర’ సినిమా అందరి గుండెలను తాకిందని గుడివాడ ఎమ్మెల్యే, వైసీపీ నేత కొడాలి నాని తెలిపారు. సంక్షేమ పథకాల ఆవిర్భావానికి ఈ పాదయాత్ర పెద్దపీట వేసిందన్నారు.

సినిమాలో మమ్ముట్టి గారిని చూస్తున్నంతసేపు వైఎస్ మాత్రమే కనిపించారని వ్యాఖ్యానించారు. సినిమాను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మహి.వి.రాఘవ్, యూనిట్ కు అభినందనలు తెలిపారు. ఈ మేరకు నాని ట్విట్టర్ లో స్పందించారు. అంతకుముందు గుడివాడలో అభిమానులు, వైసీపీ కార్యకర్తలతో కలిసి యాత్ర సినిమాను చూసిన నాని.. కేకు కోసి సంబరాలు చేసుకున్నారు.

More Telugu News