Rashmika: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • సిగ్గెక్కువ అంటోన్న కథానాయిక 
  • ఫైట్ చేస్తున్న 'ఇస్మార్ట్ శంకర్'
  • మొదలైన 'పెళ్లిచూపులు' దర్శకుడి చిత్రం

*  తనకి కాస్త సిగ్గు ఎక్కువ అంటోంది కథానాయిక రష్మిక మందన. 'తొలి సినిమా అప్పుడు అంటే అనుకోవచ్చు కానీ, ఇప్పటికీ కెమెరా ముందుకు వెళుతుంటే నాకు సిగ్గుగానే ఉంటోంది. ఇక ఏదైనా కార్యక్రమంలో పాల్గొనడానికి స్టేజి ఎక్కాలంటే మరీ సిగ్గు. ఇది త్వరగా పోతే బాగుండును' అంటూ నవ్వుతూ చెప్పింది రష్మిక .
*  రామ్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం షూటింగ్ గత కొన్ని రోజులుగా హైదరాబాదులో జరుగుతోంది. ప్రస్తుతం హీరో, ఫైటర్స్ పాల్గొనే ఓ యాక్షన్ ఎపిసోడ్ ను చిత్రీకరిస్తున్నారు. ఇందులో నిధి అగర్వాల్, నాభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
*  సూపర్ హిట్ సినిమా 'పెళ్లిచూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా మారుతున్నాడు. ఆయన హీరోగా విజయ్ దేవరకొండ తన 'కింగ్ ఆఫ్ హిల్' బ్యానర్ పై ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు నిన్న హైదరాబాదులో జరిగాయి. 

More Telugu News