chidambaram: ఈడీ ఎదుట హాజరైన చిదంబరం.. 2 గంటల పాటు విచారణ

  • ఐఎన్ఎక్స్ మీడియా కేసు విచారణకు చిదంబరంను పిలిచిన ఈడీ
  • ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి వెళ్లిన చిదంబరం
  • ఇప్పటికే చిదంబరంను పలుమార్లు విచారించిన ఈడీ

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఈరోజు ఈడీ ముందు హాజరయ్యారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వివరణ కోసం చిదంబరంను ఈడీ అధికారులు పిలిపించారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చిదంబరం వెళ్లారు. దాదాపు 2 గంటల సేపు చిదంబరంను ఈడీ అధికారులు విచారించారు. గతంలో కూడా ఈ కేసులో పలుమార్లు చిదంబరంను ఈడీ ప్రశ్నించింది.

More Telugu News