vijay: 'మైఖేల్'గా విజయ్ .. అట్లీ కుమార్ తో మూడో మూవీ

  • సంచలన విజయాన్ని సాధించిన 'సర్కార్'
  • 'మైఖేల్' పాత్రలో విజయ్
  • కథానాయికగా నయనతార    

విజయ్ హీరోగా వచ్చిన 'సర్కార్' సంచలన విజయాన్ని సాధించింది. విజయ్ కెరియర్లోనే చెప్పుకోదగిన చిత్రంగా నిలిచింది. దాంతో ఆ తరువాత చేసే సినిమా ఆ స్థాయిదై ఉండాలనే ఉద్దేశంతో, దర్శకుడు అట్లీ కుమార్ కి విజయ్ ఛాన్స్ ఇచ్చాడు. గతంలో అట్లీ కుమార్ దర్శకత్వంలో విజయ్ చేసిన 'తెరి' .. 'మెర్సల్' చిత్రాలు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి.

ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో ఓ సినిమా సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో 'మైఖేల్' అనే పాత్రలో విజయ్ కనిపిస్తాడట. అందువలన ఈ సినిమాకి 'మైఖేల్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్టు, దాదాపు దీనినే ఖరారు చేయనున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది. ఏజిఎస్ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాకి, ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.

More Telugu News