Telangana: విద్యార్థుల గ్యాంగ్ ఫైట్.. సహచర విద్యార్థితో పాటు అతని తల్లిదండ్రులను చితకబాదిన స్టూడెంట్స్!

  • హైదరాబాద్ లోని సీతాఫల్ మండీలో ఘటన
  • పోలీసులకు బాధిత కుటుంబం ఫిర్యాదు
  • దర్యాప్తు చేస్తున్న పోలీసులు

సినిమాలు పిల్లలను ఎంతలా చెడగొడుతున్నాయో చెప్పడానికి పక్కా ఉదాహరణ ఇది. సినిమాల తరహాలో గ్యాంగ్ గా ఏర్పడ్డ ఓ స్కూలు విద్యార్థులు మరో గ్యాంగ్ కు చెందిన స్టూడెంట్ ను అతని ఇంటికి వెళ్లి మరీ చితక్కొట్టారు. అడ్డుగా వచ్చిన సదరు బాలుడి తల్లిదండ్రులను కూడా చితకబాదారు. ఈ ఘటన తెలంగాణలోని హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

హైదరాబాద్ లోని సీతాఫల్ మండికి చెందిన శ్రీవాస్తవ్ స్థానికంగా ఉన్న ఓ స్కూలులో పదో తరగతి చదువుతున్నాడు. ఈ క్లాసులోని విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి గొడవపడేవారు. అయితే నిన్న ఈ గొడవ కాస్తా ముదరడంతో శ్రీవాస్తవ్ ఇంటికి ఓ గ్యాంగ్ విద్యార్థులు వెళ్లారు.

అతడిపై కర్రలు, రాడ్లతో దాడికి దిగారు. వీరిని అడ్డుకోబోయిన తల్లిదండ్రులను సైతం చితక్కొట్టారు. దీంతో బాధిత కుటుంబం చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News