new zealand: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. టీమిండియా పరువు నిలబెట్టుకుంటుందా?

  • ఆక్లండ్ లో కివీస్-భారత్ ల మధ్య రెండో టీ20
  • టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలనుకున్నామన్న రోహిత్
  • ఎలాంటి మార్పులు లేకుండానే బరిలోకి దిగిన ఇరు జట్లు

ఆక్లండ్ లో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి టీ20లో భారత్ ఘోరంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది. మరోవైపు, ఈ మ్యాచ్ ను గెలిచి సిరీస్ ను కైవసం చేసుకోవాలని కివీస్ ఉవ్విళ్లూరుతోంది. టాస్ ఓడిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ, టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకోవాలని తాము అనుకున్నామని చెప్పాడు.

టీమిండియా జట్టు: రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రిషభ్ పంత్, విజయ్ శంకర్, దినేష్ కార్తీక్, ధోనీ, హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, చాహల్, ఖలీల్ అహ్మద్.

న్యూజిలాండ్ జట్టు: సీఫ్రెట్, మన్రో, విలియంసన్, మిచెల్, టేలర్, గ్రాండ్ హోమ్, శాంట్నర్, కుగ్లీన్, సౌథీ, సోధీ, ఫెర్య్గూసన్.

More Telugu News