karthi: 'దేవ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వేదిక ఖరారు

  • రజత్ రవిశంకర్ నుంచి 'దేవ్'
  • మరోసారి కార్తీ జోడీగా రకుల్
  • ఈ నెల 14వ తేదీన విడుదల

కార్తీ కథానాయకుడిగా రజత్ రవిశంకర్ దర్శకత్వంలో 'దేవ్' సినిమా నిర్మితమైంది. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో రకుల్ కథానాయికగా నటించింది. ఈ నెల 14వ తేదీన ఈ సినిమాను తెలుగులోను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో ప్లాన్ చేశారు.

ఈ నెల 10వ తేదీన అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్ లో సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుకను ఆరంభించనున్నారు. హారిస్ జైరాజ్ అందించిన సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఇంతకుముందు కార్తీ - రకుల్ జంటగా నటించిన 'ఖాకీ' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో సహజంగానే 'దేవ్'పై అంచనాలు వున్నాయి. ఈ జంటకి ఈ సినిమా కూడా హిట్ తెచ్చిపెడుతుందేమో చూడాలి.

More Telugu News