ys rajashekar reddy: నాడు చిన్న మార్పుతో ప్రజల మనసులను వైఎస్ రాజశేఖరరెడ్డి చూరగొన్నారు.. ఎవరినీ తీసిపారేయద్దు: ‘లోక్ సత్తా’ వ్యవస్థాపకుడు జేపీ

  • అందరికీ, అన్నీ అందాలని వైఎస్ కీలక అంశంగా పెట్టుకున్నారు
  • ఆ దెబ్బతో ప్రజల మనసుల్లో నిలిచిపోయారు
  • ఏ నాయకుడిని తక్కువ అంచనా వేయొద్దు

దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గురించి లోక్ సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాష్ నారాయణ్ (జేపీ) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్వ్యూలో ఆయన మాట్లాడుతూ, నాడు చిన్న మార్పుతో ప్రజల మనసులను వైఎస్ రాజశేఖరరెడ్డి చూరగొన్నారని అన్నారు. ఇచ్చే తాయిలాలు వాళ్లకు అందాయి, వీళ్లకు అందలేదన్న గొడవ లేకుండా, అధికారులు, ఉద్యోగుల ప్రమేయం లేకుండా అందరికీ, అన్నీ అందడమన్నది కీలకమైన అంశంగా పెట్టుకున్నారని, ఆ దెబ్బతో ప్రజల మనసుల్లో బలమైన స్థానాన్ని వైఎస్ సంపాదించుకున్నారని అన్నారు.

ఏ నాయకుడినీ తక్కువ అంచనా వేయొద్దని, ఆ సందర్భాన్ని లేదా వారి వ్యక్తిత్వాన్ని అనుసరించో ప్రతి నాయకుడికి వారి పరిమితులు వారికి ఉంటాయని, అది నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ , కేసీఆర్, చంద్రబాబు లేదా జగన్ కావచ్చు ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దని అన్నారు. నాయకుల గురించి తేలికగా మాట్లాడటం, వారిపై కటువైన భాష మాట్లాడటం, తీసి పారేయడం ఈ దేశంలో అలవాటైపోయిందని అభిప్రాయపడ్డారు.

More Telugu News