chattisgargh: ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులకు చావు దెబ్బ.. 10 మందిని కాల్చిచంపిన భద్రతాబలగాలు!

  • బీజాపూర్ లోని బైరాన్ ఘడ్ లో ఘటన
  • కూంబింగ్ చేపడుతుండగా ఎదురుపడ్డ మావోలు
  • 11 తుపాకులు, భారీగా మందుగుండు స్వాధీనం

ఛత్తీస్ గఢ్ లోని బీజాపూర్ జిల్లాలో భద్రతాబలగాలు, మావోయిస్టులకు మధ్య ఈరోజు భీకర ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎదురుకాల్పుల్లో భద్రతాబలగాలు 10 మంది మావోయిస్టులను కాల్చిచంపాయి. ఘటనాస్థలం నుంచి అధికారులు భారీ ఎత్తున మందుగుండు సామగ్రి, 11 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న మావోయిస్టుల కోసం బలగాలు గాలిస్తున్నాయి.

ఈ విషయమై జిల్లా ఎస్పీ మోహిత్ గార్గ్ మాట్లాడుతూ.. బైరాన్ ఘడ్ ప్రాంతంలో ఈరోజు ఎస్టీఎఫ్, డీఆర్జీ సంయుక్త బలగాలు కూంబింగ్ చేపట్టాయని తెలిపారు. ఇంతలోనే మావోయిస్టులు ఎదురుపడటంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయని అన్నారు. ఈ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాల తరఫున ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదన్నారు. ఘటనాస్థలం నుంచి తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపును ముమ్మరం చేశామన్నారు.

More Telugu News