sai dharam tej: మారుతి దర్శకత్వంలో మెగాహీరో

  • తేజు హీరోగా 'చిత్రలహరి'
  • తదుపరి సినిమా మారుతితో
  • త్వరలోనే పట్టాలెక్కనున్న ప్రాజెక్టు

సాయిధరమ్ తేజ్ వరుస పరాజయాలతో సతమతమవుతున్నాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో, కిషోర్ తిరుమల వినిపించిన వైవిధ్యభరితమైన కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 'చిత్రలహరి' పేరుతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా తరువాత మారుతితో కలిసి తేజు సెట్స్ పైకి వెళ్లడానికి రంగం సిద్ధమవుతున్నట్టుగా సమాచారం.

గీతా 2 .. యూవీ క్రియేషన్స్ వారు కలిసి ఈ సినిమాను నిర్మించనున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి నానితో ఓ సినిమా చేయాలని మారుతి అనుకున్నాడు. కానీ నాని ఇతర కమిట్మెంట్స్ కారణంగా కుదరలేదు. దాంతో తేజుతో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికి మారుతి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రస్తుతం కిషోర్ తిరుమలతో చేస్తోన్న 'చిత్రలహరి' .. ఆ తరువాత మారుతితో చేయనున్న సినిమా తనకి ఈ ఏడాది హిట్స్ తెచ్చిపెడతాయని తేజు భావిస్తున్నాడు. ఆయన ఆశ నెరవేరుతుందేమో చూడాలి మరి.

More Telugu News