Andhra Pradesh: కృష్ణా జిల్లాలోని ఓ ఇంట్లో పేలిన సిలిండర్.. సజీవ దహనమైన యువకుడు!

  • మచిలీపట్నంలోని మగ్గాలకాలనీలో ఘటన
  • మంటలను అదుపుచేసిన అగ్నిమాపక సిబ్బంది
  • కేసు నమోదు చేసిన పోలీసులు

కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మగ్గాలకాలనీలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇక్కడి ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ ప్రమాదవశాత్తూ పేలిపోవడంతో మహ్మద్ బాజీ అనే యువకుడు మంటల్లో చిక్కుకున్నాడు. చుట్టుపక్కలవారు వచ్చి కాపాడేలోపే సజీవదహనం అయ్యాడు. ఈ దుర్ఘటనలో అతను ఉంటున్న ఇల్లు పూర్తిగా ధ్వంసమయింది.

సిలిండర్ పేలుడు సందర్భంగా భారీ శబ్దం రావడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. మరోవైపు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News