chaitu: 'గరుడవేగ' దర్శకుడికి చైతూ గ్రీన్ సిగ్నల్

  • చైతూ తాజా చిత్రంగా 'మజిలీ'
  • ఈ నెల 22 నుంచి 'వెంకీమామ' మొదలు
  • దిల్ రాజు నిర్మాణంలోను ఓ సినిమా    

'గరుడవేగ' .. దర్శకుడిగా ప్రవీణ్ సత్తారు సత్తాను చాటి చెప్పింది. ఎంతో కాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తోన్న రాజశేఖర్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చింది. ఆయన అభిమానులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అలాంటి ప్రవీణ్ సత్తారుతో ఒక సినిమా చేయడానికి నాగచైతన్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ప్రస్తుతం నాగచైతన్య 'మజిలీ' సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇక ఈ నెల 22 నుంచి బాబీ దర్శకత్వంలో 'వెంకీమామ' పట్టాలెక్కనుంది. ఈ సినిమా తరువాత కొత్త దర్శకుడితో కలిసి చైతూ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ ప్రాజెక్టు దిల్ రాజు బ్యానర్లో నిర్మితం కానుంది. ఆ తరువాత ప్రవీణ్ సత్తారు సినిమా చేయనున్నట్టు సమాచారం. అంటే వచ్చే ఏడాదిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుందని అనుకోవచ్చు. ఈ లోగా ప్రవీణ్ సత్తారు ఏ హీరోతో .. ఏ ప్రాజెక్టు సెట్ చేస్తాడో చూడాలి. 

More Telugu News