Trisha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో కథానాయిక ప్రధాన చిత్రంలో త్రిష 
  • 'ఎఫ్ 2'కు ఎనభై కోట్ల వసూళ్లు 
  • అజయ్ భూపతి 'మహాసముద్రం'

 *  కొత్తతరం హీరోయిన్లు ఎంతమంది వస్తున్నప్పటికీ ఇంకా తాను సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న త్రిష తాజాగా ఓ కథానాయిక ప్రధాన చిత్రంలో నటించడానికి అంగీకరించింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ నిర్మించే ఈ చిత్రానికి శరవణన్ దర్శకత్వం వహిస్తాడు.
*  వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'ఎఫ్ 2' చిత్రం బాక్సాఫీసు వద్ద ఇంకా దూసుకుపోతోంది. ఇప్పటికి 78 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిన ఈ చిత్రం ఈ వారాంతానికి 80 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు.
*  'ఆర్ ఎక్స్ 100' ఫేం అజయ్ భూపతి తన రెండో చిత్రాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా రూపొందిస్తున్నాడు. సమంత కథానాయికగా నటించే ఈ చిత్రానికి 'మహా సముద్రం' అనే టైటిల్ని పరిశీలిస్తున్నారట. 

More Telugu News