Pawan Kalyan: జనసేనలో చేరిన రాజకీయ విశ్లేషకుడు పుల్లారావు.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన పవన్

  • పుల్లారావుపై పవన్ ప్రశంసలు
  • జనసేన పొలిటికల్  అఫైర్స్ కమిటీ సభ్యుడిగా నియామకం
  • జనసేన లాంటి పార్టీల అవసరం దేశానికి ఉందన్న పుల్లారావు

ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, కాలమిస్ట్ పెంటపాటి పుల్లారావు జనసేనలో చేరారు. అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పవన్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ..  పోలవరం నిర్వాసితుల కోసం పుల్లారావు ఎంతో పోరాడారని ప్రశంసించారు. గిరిజనులకు అండగా నిలబడ్డారని కొనియాడారు. అమెరికాలో చదువుకున్న ఆయన అనుభవం పార్టీకి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

పుల్లారావు జనసేనలో చేరిన వెంటనే పవన్ ఆయనను పార్టీ పొలిటికల్  అఫైర్స్ కమిటీ సభ్యుడిగా నియమించారు. పుల్లారావు మాట్లాడుతూ.. ప్రజల కోసం శ్రమిస్తున్న పవన్ బాటలోనే తాను కూడా నడుస్తానన్నారు. మార్పు కోసం పనిచేస్తున్న పవన్‌తో కలిసి పనిచేసేందుకు అందరూ కలిసి రావాలని కోరారు. పవన్ తనను పార్టీలోకి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలిపారు. పవన్‌ను గెలిపించడానికే పార్టీలో చేరానన్న పుల్లారావు.. జనసేన లాంటి పార్టీల  అవసరం ఈ దేశానికి ఎంతో ఉందన్నారు.

More Telugu News