money landering: మనీ ల్యాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రాను విచారించిన ఈడీ

  • లండన్ లో తనకు ఎలాంటి ఆస్తులు లేవన్న వాద్రా
  • మనోజ్ అరోరా తన సంస్థ ఉద్యోగని చెప్పిన వాద్రా
  • వాద్రా స్టేట్ మెంట్ ను రికార్డు చేసిన అధికారులు

మనీ ల్యాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రాను ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు (ఈడీ) ఈరోజు విచారించారు. ఈ సందర్భంగా వాద్రా స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. లండన్ లో స్థిరాస్తుల కొనుగోలుకు సంబంధించిన లావాదేవీలు, ఆస్తుల వివరాలపై వాద్రాను ప్రశ్నించారు. లండన్ లో తనకు ఎలాంటి ఆస్తులు లేవన్న విషయాన్ని వాద్రా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వాద్రాకు అత్యంత సన్నిహితుడిగా పేరు పొందిన మనోజ్ అరోరా గురించి అధికారులు ప్రశ్నించారు. తన వద్ద గతంలో పని చేసిన ఉద్యోగిగా మాత్రమే ఆయన తనకు తెలుసని, తన తరపున ఆయన ఎటువంటి ఈ-మెయిల్స్ రాయలేదని అధికారులతో వాద్రా చెప్పినట్టు సమాచారం.

More Telugu News