Hyderabad: బాలికపై దాడికి పాల్పడ్డ భరత్ ను కఠినంగా శిక్షించాలి: బీజేపీ నేత కిషన్ రెడ్డి

  • సభ్య సమాజం తలదించుకునేలా ఈ దాడి జరిగింది
  • ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలి
  • సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఆలోచించాలి

 ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోన్న మధులిక అనే బాలికపై భరత్ అనే యువకుడు కత్తితో దాడి చేసిన ఘటనపై బీజేపీ నేత కిషన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ,ఈ దాడికి పాల్పడ్డ భరత్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా ఈ దాడి జరిగిందని, ఇలాంటి ఘటనలు జరగకుండా సమాజంలో ఉన్న అన్ని వర్గాలు ఆలోచించాలని సూచించారు. ఇంటి నుంచి బయటకెళ్లిన ఆడపిల్లలు తిరిగి క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.  

More Telugu News