bellamkonda srinivas: 'టైగర్ నాగేశ్వరరావు' బయోపిక్ లో బెల్లంకొండ శ్రీనివాస్

  • ముందుగా వినిపించిన రానా పేరు
  • ఆ తరువాత లైన్లోకి బెల్లంకొండ శ్రీనివాస్
  • 'రాచ్చసన్' రీమేక్ తరువాత సెట్స్ పైకి      

తెలుగులో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో 'టైగర్ నాగేశ్వర రావు' బయోపిక్ కూడా తెరకెక్కనున్నట్టు వార్తలు వచ్చాయి. స్టూవర్టుపురం రాబిన్ హుడ్ గా టైగర్ నాగేశ్వరరావుకి పేరుంది. గతంలో 'కిట్టు వున్నాడు జాగ్రత్త' సినిమా చేసిన దర్శకుడు వంశీకృష్ణ .. ఈ సినిమాను రూపొందిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ముందుగా రానాతో అనుకున్నప్పటికీ ఆ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ చేయనున్నట్టు చెప్పుకున్నారు.

 ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్ డేట్ లేకపోవడంతో ఆగిపోయిందని అంతా అనుకున్నారు. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ నే ఫిక్స్ చేసుకున్నారనేది తాజా సమాచారం. 'రాచ్చసన్' తమిళ రీమేక్ తరువాత బెల్లంకొండ శ్రీనివాస్ ఈ సినిమా చేయనున్నట్టుగా చెబుతున్నారు. అయితే ముందుగా అనుకున్నట్టుగా ఈ సినిమాకి నిర్మాత అనిల్ సుంకర కాదు .. అభిషేక్ అగర్వాల్ అని తెలుస్తోంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Telugu News