Andhra Pradesh: తెలంగాణ సీఎం కేసీఆర్, జగన్ లపై ఏపీ మంత్రి లోకేశ్ తీవ్ర వ్యాఖ్యలు!

  • జగన్, కేసీఆర్ మోదీకి బీ-టీమ్
  • అందుకే కోల్ కతా ర్యాలీకి రాలేదు
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి నారా లోకేశ్ విమర్ళలు గుప్పించారు. జగన్, కేసీఆర్ ఇద్దరూ ప్రధాని మోదీకి బీ-టీమ్ గా ఉన్నారని వ్యాఖ్యానించారు.

లోకేశ్ ఈరోజు ట్విట్టర్ లో స్పందిస్తూ..‘బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ పశ్చిమబెంగాల్ సీఎం మమతా దీదీకి మద్దతుగా కోల్ కతా ర్యాలీలో పాల్గొంటే, ఫెడరల్ ఫ్రంట్ కు సుప్రీం లీడర్ అని చెప్పుకుంటున్న ఓ వ్యక్తి, అవినీతి రాజు అయిన దొంగబ్బాయి మాత్రం కనిపించలేదు. వీరిద్దరూ మోదీ బీ-టీమ్ అనడానికి ఇంతకంటే ఆధారం ఏం కావాలి’ అని ట్వీట్ చేశారు.

More Telugu News