t20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా.. జట్టు వివరాలు ఇవిగో!

  • ఇప్పటికే వన్డే సిరీస్ గెలుచుకున్న టీమిండియా
  • టీ20ను కూడా కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్న భారత్
  • జట్టులో పాండ్యా సోదరులు

న్యూజిలాండ్ గడ్డపై పొట్టి క్రికెట్ సమరం ప్రారంభమైంది. ఇప్పటికే వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని, మంచి ఊపు మీద ఉన్న టీమిండియా... టీ20 సిరీస్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. వెల్లింగ్టన్ లో జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రిషభ్ పంత్, విజయ్ శంకర్, కార్తీక్, ధోనీ (కీపర్), హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యా, చాహల్, భువనేశ్వర్ కుమార్, ఖలీల్ అహ్మద్. భారత జట్టులో అన్నదమ్ములైన హార్దిక్ పాండ్యా, కృణాల్ పాండ్యాలు ఉండటం గమనార్హం.

న్యూజిలాండ్ జట్టు: విలియంసన్ (కెప్టెన్), మన్రో, మిచెల్, సీఫర్ట్ (కీపర్), టేలర్, గ్రాండ్ హోమ్, శాంట్నర్, కగ్గెలీన్, సౌథీ, సోధీ, ఫెర్యూసన్.

More Telugu News