Andhra Pradesh: పోలీస్ ఏఆర్ కార్యాలయంలో పేలిన తుపాకీ.. విచారణకు ఆదేశించిన ఉన్నతాధికారులు!

  • ఏపీలోని ఏలూరులో ఘటన
  • తుపాకీ తీసుకుంటుండగా పేలుడు
  • సిబ్బందికి తప్పిన ముప్పు

ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లాలో తుపాకీ పేలింది. ఇక్కడి ఏలూరు పోలీస్ ఏఆర్ కార్యాలయంలో తుపాకులను తీసుకుని వస్తుండగా ఓ తుపాకీ అనుకోకుండా పేలింది. ఈ శబ్దం విన్న అధికారులు, ఇతర సిబ్బంది తొలుత హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు తుపాకీ ప్రమాదవశాత్తూ పేలడంపై పోలీస్ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.

More Telugu News