Samantha: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బెల్లంకొండ శ్రీనివాస్ తో మళ్లీ సమంత 
  • కార్తీ వల్లే ఆ సినిమా వచ్చిందట!
  • షూటింగుకి రెడీ అవుతున్న 'వెంకీమామ'    

*  బెల్లంకొండ శ్రీనివాస్ సరసన మళ్లీ సమంత కథానాయికగా నటించనుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో శ్రీనివాస్ ఓ చిత్రం చేయనున్నాడు. ఇందులో కథానాయిక పాత్ర కోసం సమంతతో చర్చలు జరుపుతున్నారు. గతంలో 'అల్లుడు శీను' సినిమాలో వీరిద్దరూ జంటగా నటించారు.
*  కథానాయిక రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా తమిళంలో కార్తీ సరసన 'దేవ్' సినిమాలో నటించింది. ఈ సినిమాలో అవకాశం కార్తీ వల్లే తనకు వచ్చిందని రకుల్ చెప్పింది. తనతో కలసి 'ఖాకీ' సినిమాలో నటిస్తున్నప్పుడు, దేవ్ సినిమాలో కూడా ఆఫర్ ఇచ్చాడని రకుల్ తెలిపింది. ఇందులో తాను మోడరన్ గాళ్ గా కనిపిస్తానని చెప్పింది.
*  వెంకటేశ్, నాగ చైతన్య కలసి నటించే 'వెంకీ మామ' చిత్రం షూటింగ్ ఈ నెల 22 నుంచి రాజమండ్రిలో నిర్వహిస్తారు. కె.ఎస్.రవీంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకీ సరసన శ్రియ, చైతూ పక్కన రకుల్ హీరోయిన్లుగా నటిస్తారు. 

More Telugu News