keerthi suresh: ప్రధాన పాత్రధారిగా కీర్తి సురేశ్ .. కేరళలో ఏకధాటిగా షూటింగ్

  • నరేంద్రనాథ్ దర్శకత్వంలో కీర్తి సురేశ్
  • ఈ నెల 10వ తేదీ నుంచి మొదలు
  • తమిళంతో పాటు తెలుగులోను  

వరుస సినిమాలతో .. వరుస విజయాలతో కీర్తి సురేశ్ మాంఛి జోష్ తో వుంది. ఈ నేపథ్యంలో ఆమె నాయిక ప్రాధాన్యత కలిగిన ఒక సినిమా చేయడానికి అంగీకరించింది. నరేంద్రనాథ్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకి, సినిమాటోగ్రఫర్ గా డానీ సాంచెజ్ లోపెజ్ పనిచేయనున్నారు. 'మహానటి' సినిమాకి ఈయనే సినిమాటోగ్రఫర్ గా పనిచేశారు.

మహేశ్ కోనేరు నిర్మిస్తోన్న ఈ సినిమాను ఫిబ్రవరి 10వ తేదీన మొదలుపెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. కథ ప్రకారం ఈ సినిమా కేరళ నేపథ్యంలో కొనసాగుతుందట. అందువలన ఎక్కువభాగం చిత్రీకరణ అక్కడ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఏకధాటిగా అక్కడ కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమాను ఒకేసారి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

More Telugu News