nithin: మా సినిమాలో అవకాశాల కోసం మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దు: 'భీష్మ' దర్శకుడు వెంకీ కుడుముల

  • నితిన్ హీరోగా 'భీష్మ'
  • దర్శకుడిగా వెంకీ కుడుముల
  • ఆ ప్రచారంలో నిజం లేదు

'ఛలో' సినిమాతో దర్శకుడిగా వెంకీ కుడుముల భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆయన తదుపరి సినిమా నితిన్ తో వుంది. ఈ సినిమాకి 'భీష్మ' అనే టైటిల్ ను ఖరారు చేసుకున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే 'నితిన్ తాజా చిత్రంలో ఏదో ఒక పాత్రలో మీరు కనిపించాలనుకుంటున్నారా? అయితే 3 లక్షలు కడితే చాలు .. మీ కలను మేము నెరవేరుస్తాము' అంటూ ఒక వాట్సాప్ గ్రూప్ ప్రత్యక్షమైంది.

ఈ గ్రూపులో రోజురోజుకి సభ్యుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో .. ఈ సినిమా టీమ్ దృష్టికి వెళ్లింది. ఈ విషయంపై దర్శకుడు వెంకీ కుడుముల స్పందిస్తూ .."డబ్బు కడితే నితిన్ 'భీష్మ' సినిమాలో ఛాన్స్ ఇస్తామంటూ జరుగుతోన్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. ఆ వాట్సాప్ గ్రూపుకి .. ఈ సినిమా యూనిట్ కి ఎలాంటి సంబంధం లేదు. కొత్తవాళ్లు అవసరమైతే యూనిట్ నుంచి కాస్టింగ్ కాల్ ప్రకటన వస్తుంది .. అంతేగానీ, మధ్యవర్తులను నమ్మేసి మోసపోవద్దు' అని స్పష్టం చేశాడు. 

More Telugu News