Jarkhand: జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. చిన్నారి సహా ఐదుగురి మృతి

  • ర్యాలీలో పాల్గొని తిరిగొస్తుండగా ప్రమాదం
  • డ్రైవర్ నిర్లక్ష్యంతోనే బస్సు బోల్తా
  • క్షతగాత్రులకు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స

జార్ఖండ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా.. 30 మందికి గాయాలయ్యాయి. మృతుల్లో ఒక చిన్నారితో పాటు ముగ్గురు మహిళలు ఉన్నారు. గాయపడినవారిని స్థానికులు దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. దేవ్‌ధర్‌ జిల్లా కచ్వాబంద్‌లో జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది.

డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్టు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీస్ అధికారి ఉపాధ్యాయ తెలిపారు. ప్రయాణికులంతా భాస్కర్ గ్రామానికి చెందిన వారని పోలీసులు పేర్కొన్నారు. వీరంతా దుంకా జిల్లాలో ఓ రాజకీయ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బాధితులకు తక్షణ సాయం కింద 50 వేలు అందజేయనున్నట్లు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి రాజ్ పలివార్ తెలిపారు.

More Telugu News