Guntur District: తెనాలిలో ఘట్టమనేని ఆదిశేషగిరిరావుని కలిసిన టీడీపీ నేతలు

  • ఆదిశేషగిరిరావు నివాసానికి వెళ్లిన టీడీపీ నేతలు
  • టీడీపీలో చేరాలని ఆహ్వానం
  • ఆదిశేషగిరి రావుని కలిసిన వారిలో బుద్ధా వెంకన్న, వర్ల తదితరులు

ప్రముఖ నటుడు కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావును టీడీపీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో గుంటూరు జిల్లాలోని తెనాలిలో ఆయన నివాసానికి టీడీపీ నేతల బృందం ఈరోజు వెళ్లింది. ఆదిశేషగిరిరావును కలిసిన టీడీపీ బృందంలో బుద్ధా వెంకన్న, ఆలపాటి రాజా, గద్దె రామ్మోహన్ రావు, వర్ల రామయ్య, జలీల్ ఖాన్ ఉన్నారు. కాగా, గతంలో వైసీపీలో ఉన్న ఆదిశేషగిరిరావు ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేశారు.  

More Telugu News