tirupathi: తిరుపతిలో వైసీపీ-టీడీపీ కార్యకర్తల తోపులాట..స్పృహ తప్పి పడిపోయిన ఎమ్మెల్యే చెవిరెడ్డి

  • డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కార్యక్రమం
  • చెవిరెడ్డి ప్రసంగాన్ని అడ్డుకున్న మహిళలు
  • టీడీపీ-వైసీపీ కార్యకర్తల తోపులాట

వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. తిరుపతిలోని వేదాంతపురంలో డ్వాక్రా మహిళలకు పసుపు-కుంకుమ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెవిరెడ్డి భాస్కరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి ప్రసంగిస్తుండగా మహిళా సంఘాలు అడ్డుకున్నాయి. చెవిరెడ్డి వెనక్కి వెళ్లాలంటూ మహిళలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో చెవిరెడ్డి స్పృహ తప్పిపడిపోయారు. చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి చెవిరెడ్డిని పోలీసులు తరలించారు.

More Telugu News