Jagan: సోమవారం ఢిల్లీ వెళ్లనున్న జగన్

  • ఎన్నికల కమిషన్‌ను కలవనున్న జగన్
  • ఓటర్ల జాబితాలోని అవకతవకలపై ఫిర్యాదు
  • భోజనానంతరం తిరిగి హైదరాబాద్

ఏపీ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్.. కొందరు ముఖ్య నేతలతో కలిసి సోమవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఓటర్ల జాబితాలోని అవకతవకలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నారు. జగన్ బృందానికి ఉదయం 11:30కు ఈసీ అపాయింట్‌మెంట్ ఇచ్చింది. నకిలీ ఓట్ల సృష్టి, ఓటర్ల జాబితాలోని అవకతవకలు తదితర అంశాలపై చర్యలు తీసుకోవాలని జగన్ బృందం ఈసీని కోరనుంది. మధ్యాహ్న భోజనానంతరం జగన్ తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. 

More Telugu News