suman ranganadhan: విడుదలకి ముస్తాబవుతోన్న 'దండుపాళ్యం 4'

  • ఆసక్తికరమైన కథాకథనాలు
  •  అనూహ్యమైన  మలుపులు
  •  మార్చిలో ప్రేక్షకుల ముందుకు

వెంకట్ నిర్మాణంలో .. కేటీ నాయక్ దర్శకత్వంలో 'దండుపాళ్యం 4' చిత్రం రూపొందింది. బెనర్జీ .. వెంకట్ .. సుమన్ రంగనాథన్ .. ముమైత్ ఖాన్ ప్రధానమైన పాత్రలను పోషించారు. తాజాగా ఈ సినిమా టీమ్ విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది.ఈ వేదికపై నిర్మాత వెంకట్ మాట్లాడుతూ .." ఇటీవలే ఈ సినిమా షూటింగును పూర్తి చేసుకుని ..నిర్మాణానంతర పనులను జరుపుకుంది. త్వరలో సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకోనుంది. మార్చిలో ఈ సినిమాను విడుదల చేయనున్నాము. ఏడుగురు సభ్యులు కలిగిన ఒక బృందానికి నాయకురాలిగా ఈ సినిమాలో సుమన్ రంగనాథన్ కనిపిస్తుంది. జైలులో వున్న తమ సహచరులను అక్కడి నుంచి తప్పించడానికి ఒక బృందం ఎలాంటి వ్యూహ రచన చేసింది? ఆ ప్రయత్నంలో వాళ్లకి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథ కొనసాగుతుంది" అని ఆయన చెప్పారు.    

More Telugu News