Hyderabad: గాంధీభవన్ లో వీహెచ్, శ్రీకాంత్ వర్గీయుల ఘర్షణ.. కుర్చీలు విసురుకున్న వైనం!

  • గాంధీ భవన్ లో మల్లు భట్టివిక్రమార్కకు సన్మానం
  • ఈ కార్యక్రమానికి హాజరైన వీహెచ్, నూతి శ్రీకాంత్
  • శ్రీకాంత్ కు వీహెచ్ టికెట్ రాకుండా చేశారంటూ ఘర్షణ  

హైదరాబాద్ లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీ భవన్ లో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్కకు నిర్వహించిన సన్మాన కార్యక్రమం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నేతలు వి.హనుమంతరావు (వీహెచ్), నూతి శ్రీకాంత్ వర్గాల మధ్య ఘర్షణ తలెత్తడంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. ఈ క్రమంలో కార్యకర్తలు పరస్పరం కుర్చీలు విసురుకున్నారు.

 మొన్నటి ఎన్నికల్లో శ్రీకాంత్ కు టికెట్ రాకుండా వీహెచ్ అడ్డుకున్నారని ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఘర్షణ తలెత్తింది. బీసీలకు  అన్యాయం చేస్తున్నారని ఆరోపిస్తూ వీహెచ్ ని శ్రీకాంత్ వర్గీయులు అడ్డుకున్నారు. భట్టి విక్రమార్క చూస్తుండగానే వీహెచ్, శ్రీకాంత్ వర్గీయులు ఒకరిపై మరొకరు దాడులకు పాల్పడటం గమనార్హం.  

More Telugu News