pooja hegde: 'మహర్షి' కోసం భారీ పారితోషికం తీసుకున్న పూజా హెగ్డే

  • 'అరవింద సమేత'తో దక్కిన హిట్
  • షూటింగు దశలో 'మహర్షి'
  • ఎక్కువ డేట్స్ కేటాయించిన పూజా హెగ్డే    

తెలుగులో ఒకే సారిగా ఎన్టీఆర్ .. మహేశ్ బాబు .. ప్రభాస్ సినిమాలలో పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసింది. ఈ మూడు సినిమాల్లో ముందుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'అరవింద సమేత' భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా తరువాత మహేశ్ బాబుతో ఆమె చేస్తోన్న 'మహర్షి' విడుదల కానుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో వుంది.

ఈ సినిమా కోసం పూజా హెగ్డే పారితోషికంగా 2 కోట్లు డిమాండ్ చేసిందట. అయితే 1.75 కోట్ల పారితోషికాన్ని ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఎక్కువగా డేట్లు కేటాయించవలసి రావడం వల్లనే ఆమెకి ఆ స్థాయి పారితోషికం ఇస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. ఈ సినిమా హిట్ అయితే పూజా హెగ్డే పారితోషికం మరింత పెరిగిపోయే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఆ తరువాత ప్రభాస్ తో సినిమా ఉండనే వుంది. 

More Telugu News