Haryana: తల్లి బాగోతాన్ని తండ్రికి చెబుతానన్నందుకు... ప్రియుడితో కలిసి కుమార్తె హత్య!

  • హర్యానాలోని కర్నాల్ లో ఘటన
  • ప్రియుడితో సన్నిహితంగా ఉండగా చూసిన కుమార్తె
  • గొంతుపిసికి చంపి నదిలో పారేసిన అవైనం 

తన తల్లి వివాహేతర బంధాన్ని కళ్లారా చూసి, ఆ విషయాన్ని తండ్రికి చెబుతానని అన్నందుకు, ముక్కుపచ్చలారని పదేళ్ల బాలిక తల్లి చేతిలోనే దారుణ హత్యకు గురైంది. హర్యానాలోని కర్నాల్ పట్టణంలో జరిగిన ఈ దారుణ ఉదంతంపై పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, సోనమ్ అనే చిన్నారి ఆడుకునేందుకు బయటకు వెళ్లిన వేళ, ఆమె తల్లి లక్ష్మి, తన ప్రియుడు అమిత్ కుమార్ ను ఇంటికి పిలిపించుకుంది. వారిద్దరూ సన్నిహితంగా ఉన్న వేళ, ఇంటికి వచ్చిన సోనమ్, విషయాన్ని తండ్రికి చెబుతానని అంది.

 దీంతో భయపడ్డ లక్ష్మి, తన ప్రియుడితో కలిసి సోనమ్ గొంతు నొక్కి చంపేయడంతో పాటు, సమీపంలోని నదిలో మృతదేహాన్ని పడేసింది. ఆపై తన బిడ్డ కనిపించడం లేదని భర్తతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నదిలో సోనమ్ మృతదేహం లభ్యం కావడం, పోస్టుమార్టంలో అది హత్యేనని తేలడంతో విచారణను వేగవంతం చేసిన పోలీసులకు, లక్ష్మిపైనే అనుమానం వచ్చింది. ఆమెను గట్టిగా విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో లక్ష్మి, అమిత్ కుమార్ లను అరెస్ట్ చేశామని, విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు.

More Telugu News