Hyderabad: ప్రసాద్ ఐమాక్స్ పై వాణిజ్య పన్నుల శాఖ చర్యలు!

  • అధిక ధరలను వసూలు చేస్తున్నారని ఫిర్యాదు
  • దాడులు చేసిన యాంటీ ప్రాఫిటరింగ్ బృందం
  • అధిక జీఎస్టీ వసూలు చేస్తున్నారని నిర్ధారణ 

రూ. 10, రూ. 20 ఖరీదు చేసే పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ కు వందలు గుంజుతున్న మల్టీ ప్లెక్స్ లు ప్రేక్షకుల జేబులు ఖాళీ చేయిస్తుంటే, హైదరాబాద్ లోని ప్రసాద్స్ ఐమాక్స్ పై ఫిర్యాదుల సంఖ్య పెరిగిపోవడంతో వాణిజ్య పన్నుల శాఖ చర్యలు ప్రారంభించింది. సినిమా టికెట్లపై జీఎస్టీని ఇంతకుముందే 28 శాతం నుంచి 18 శాతానికి తగ్గించినా, ఆ ప్రయోజనాన్ని ప్రేక్షకులకు అందించకుండా, అధిక ధరలను కొనసాగిస్తున్నారని, ఆహార ఉత్పత్తుల ధరలు అధికంగా ఉన్నాయని ఫిర్యాదులు వెళ్లాయి.

దీంతో వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కె.వినయ్ కుమార్ నేతృత్వంలోని యాంటీ ప్రాఫిటరింగ్ బృందం తనిఖీలు జరిపి, అధిక జీఎస్టీ వసూలు నిజమేనని తేల్చింది. దీంతో విషయాన్ని రాష్ట్ర స్థాయి స్క్రీనింగ్ కమిటీ దృష్టికి తీసుకెళ్తున్నామని, ఐమాక్స్ పై చర్యలకు సిఫార్సు చేశామని ఆయన అన్నారు. కాగా, తాజా బడ్జెట్ లో సినిమాలపై జీఎస్టీని 18 నుంచి 12 శాతానికి తగ్గించిన నేపథ్యంలో, టికెట్ల ధరలు మరింతగా తగ్గాల్సివుంది.

More Telugu News